ETV Bharat / state

అడవులు లేకుంటే అంతే సంగతి: హరీశ్​ రావు - సంగారెడ్డి జిల్లా వార్తలు

దేశంలో అడవులను కాపాడుకోకుంటే రాబోయే ఐదేళ్లలో మూడు నుంచి నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు శివారు ఈద్గాలో ఎంపీలు ప్రభాకర్ రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితో కలిసి మొక్కలు నాటారు.

finance minister harish rao tour in sangareddy district
అడవులు లేకుంటే అంతే సంగతి: హరీశ్​ రావు
author img

By

Published : Jun 26, 2020, 3:12 PM IST

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరులో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ రావు పర్యటించారు. ఈద్గాలో ఎంపీలు ప్రభాకర్ రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితో కలిసి మొక్కలు నాటారు. దేశంలో అడవులను కాపాడుకోకుంటే రాబోయే ఐదేళ్లలో మూడు నుంచి నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారని గుర్తు చేశారు.

మొక్కలు పెట్టడం ఎంత ముఖ్యమో వాటిని సంరక్షించడం కూడా అంతే ముఖ్యమన్నారు. అధికారులు ప్రజా ప్రతినిధులే కాకుండా సమస్త మానవాళి హరితహారంలో పాల్గొనాలన్నారు. పటాన్​చెరు పారిశ్రామిక ప్రాంతంలో మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. ఖాళీ స్థలాలు, ప్రభుత్వ స్థలాల్లో మొక్కలు నాటాలని సూచించారు. రైతులు కూడా పొలాల గట్లపై హరితహారంలో మొక్కలు పెంచే ప్రయత్నం చేయాలని కోరారు.

జూలై 15లోగా పటాన్​చెరు నియోజకవర్గంలో డంపు యార్డ్, స్మశాన వాటికలు ఏర్పాటు పూర్తి చేయాలన్నారు. తడి పొడి చెత్తను వేరు చేసే విధంగా అధికారులు ప్రజా ప్రతినిధులు గ్రామాల్లో మహిళలకు అవగాహన కల్పించాలన్నారు.

అడవులు లేకుంటే అంతే సంగతి: హరీశ్​ రావు

ఇదీ చదవండి:వారికి స్మార్ట్​ఫోన్లే లేవ్- మరి ఆన్​లైన్​లో చదువెలా?

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరులో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ రావు పర్యటించారు. ఈద్గాలో ఎంపీలు ప్రభాకర్ రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితో కలిసి మొక్కలు నాటారు. దేశంలో అడవులను కాపాడుకోకుంటే రాబోయే ఐదేళ్లలో మూడు నుంచి నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారని గుర్తు చేశారు.

మొక్కలు పెట్టడం ఎంత ముఖ్యమో వాటిని సంరక్షించడం కూడా అంతే ముఖ్యమన్నారు. అధికారులు ప్రజా ప్రతినిధులే కాకుండా సమస్త మానవాళి హరితహారంలో పాల్గొనాలన్నారు. పటాన్​చెరు పారిశ్రామిక ప్రాంతంలో మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. ఖాళీ స్థలాలు, ప్రభుత్వ స్థలాల్లో మొక్కలు నాటాలని సూచించారు. రైతులు కూడా పొలాల గట్లపై హరితహారంలో మొక్కలు పెంచే ప్రయత్నం చేయాలని కోరారు.

జూలై 15లోగా పటాన్​చెరు నియోజకవర్గంలో డంపు యార్డ్, స్మశాన వాటికలు ఏర్పాటు పూర్తి చేయాలన్నారు. తడి పొడి చెత్తను వేరు చేసే విధంగా అధికారులు ప్రజా ప్రతినిధులు గ్రామాల్లో మహిళలకు అవగాహన కల్పించాలన్నారు.

అడవులు లేకుంటే అంతే సంగతి: హరీశ్​ రావు

ఇదీ చదవండి:వారికి స్మార్ట్​ఫోన్లే లేవ్- మరి ఆన్​లైన్​లో చదువెలా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.